చిరుకు సోదరిగా సుహాసిని కాదట.. మరెవరంటే..!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తరువాత సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్లో నటించనున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తరువాత సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్లో నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరు సోదరి పాత్రలో సుహాసినిని ఎంపిక చేశారని, దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు కూడా జరిగినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో చిరు సోదరిగా మరో సీనియర్ నటి ఖుష్బూను తీసుకోవాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.
లూసిఫర్ మాతృకలో మలయాళ నటి మంజు వారియర్ ఈ పాత్రను పోషించగా.. ఇక్కడ ఆ పాత్రకు ఖుష్బూ కరెక్ట్గా సరిపోతుందన్న భావనలో దర్శకుడు ఉన్నట్లు సమాచారం. కాగా చిరంజీవి, ఖుష్బూ ఇదివరకే స్టాలిన్ చిత్రంలో అక్కాతమ్ముడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఒకవేళ లూసిఫర్ రీమేక్ కోసం ఖుష్బూ ఓకే చెప్తే.. ఈ కాంబో మరోసారి రిపీట్ అవ్వనుంది. మరి ఇందులో నిజమెంత..? లూసిఫర్ రీమేక్లో ఎవరెవరు నటించబోతున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.