‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్… కొత్త అవతారంలో అనుష్క!

| Edited By:

Sep 11, 2019 | 1:25 PM

కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటోన్న నటి అనుష్క శెట్టి. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె చేసిన పాత్రలన్నీ ఎంతో ప్రత్యేకమైనవే. భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి సైలెంట్‌గా ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్ధం’తో తెరకెక్కుతుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్‌‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ […]

‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్... కొత్త అవతారంలో అనుష్క!
Follow us on

కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటోన్న నటి అనుష్క శెట్టి. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె చేసిన పాత్రలన్నీ ఎంతో ప్రత్యేకమైనవే. భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి సైలెంట్‌గా ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్ధం’తో తెరకెక్కుతుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్‌‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను మంచు విష్ణుతో ‘వస్తాడు నారాజు’ సినిమా రూపొందించిన హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసాడు. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ సైలెన్స్ థ్రిల్లర్. మూకీ సినిమాగా ‘నిశ్శబ్దం’ రూపొందబోతోంది.

అనుష్క శెట్టితో పాటు ఈ సినిమాలో మాధవన్, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్… ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే, హీరోయిన్ అంజలి, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు వంటి స్టార్ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతకాలపై నిర్మితమవుతున్న సినిమా భారత చలన చిత్ర సినిమాలో ఓ ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోతుందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ‘వర్ణ’, ‘సైజ్ జీరో’ వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి నటిగా నిరూపించుకున్న అనుష్క… మరోసారి ‘సైలెంట్‌’గా తన టాలెంట్ చూపించడానికి రెఢీ అవుతోందన్న మాట.ఈ సినిమాను ఎపుడు విడుదల చేస్తారో చూడాలి. మరోవైపు అనుష్క.. చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో రుద్రమదేవి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.