మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ గడియ రానేవచ్చింది. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మువీ విశ్వంభర టీచర్ ఈ రోజు (శనివారం) ఉదయం విడుదలైంది. ‘అందరూ ఎదురు చూస్తున్న అతని రాక ఓ వేడుక’ అంటూ చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. విశిష్ట దర్శకత్వంలో విజువల్ వండర్, సోషియో ఫాంటసీ త్రిల్లర్, యాక్షన్ అడ్వెంచర్ మువీగా విశ్వంభరను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ పనులు ముగింపుకు వచ్చేశాయి. భారీ విజువల్ వండర్గా ఈ మువీని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో యువీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్లు ఈ మువీ నిర్మాతలు. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కావడం విశేషం. తెరకెక్కుతోం
తాజాగా విడుదలైన ఈ మువీ టీజర్లో శ్వేత అశ్వంపై స్వారీ చేస్తున్న మెగాస్టార్ కనిపించారు. టీజర్ చూస్తున్నంత సేపు మరో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక చిరు పేరు వినిపిస్తేనే ఏదో తెలియని వైబ్రేషన్స్ చుట్టూ చేరిపోతాయి. మొత్తానికి టీజర్ విశ్వంభర మువీపై భారీగా అంచనాలను పెంచేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మువీలో చిరంజీవి సరసన హీరోయిన్ త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చిరు, త్రిష కలిసి నటిస్తున్న మువీ ఇదే. మీనాక్షి చౌదరి, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా.. వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో చిరంజీవి చెల్లెలుగా యంగ్ హీరోయిన్ రమ్య పసుపులేటి నటిస్తున్నారు. ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ మువీలో హీరోయిన్గా తెరంగెట్రం చేసిన రమ్య తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక విశ్వంభర మువీకి ఎంఎం కీరవాణి సంగీత బాణీలు అందిస్తున్నారు.