ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. హీరోయిన్‌ రేసులో ఆ ఇద్దరు..!

| Edited By:

Nov 22, 2020 | 7:12 PM

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్ఆర్‌లో నటిస్తోన్న యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌.. ఆ తరువాత త్రివక్రమ్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. హీరోయిన్‌ రేసులో ఆ ఇద్దరు..!
Follow us on

NTR-Trivikram Movie: ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్ఆర్‌లో నటిస్తోన్న యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌.. ఆ తరువాత త్రివక్రమ్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించనున్నారు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన పలు వార్తలు ఫిలింనగర్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా హీరోయిన్‌ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. (ఏపీలో పలువురు ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం)

అచ్చొచ్చిన పూజా హెగ్డేనే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తీసుకున్నట్లు మొదటి నుంచి వార్తలు వినిపించాయి. కానీ ఆ తరువాత ఖుషీ కపూర్ పేరు వినిపించింది. ఇక ఇటీవల కీర్తి సురేష్‌ పేరు కూడా చక్కర్లు కొట్టింది. అంతేకాదు యువ హీరోయిన్‌ కేతిక శర్మను ఎన్టీఆర్‌ సెలక్ట్ చేసినట్లు నడిచింది. ఇక తాజాగా మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు ఎన్టీఆర్ మూవీ కోసం వినిపిస్తున్నాయి. అందులో రష్మిక మందన్న, కియారా అద్వానీ ఉన్నారు. మూవీ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం కియారా మొదటి ఆప్షన్‌గా ఉన్నట్లు టాక్‌. ఒకవేళ ఆమె సెట్‌ అవ్వకపోతే రష్మికను తీసుకునే ఆలోచనలో మాటల మాంత్రికుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? ఎన్టీఆర్‌కి హీరోయిన్‌గా ఎవరు ఫిక్స్ అవుతారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాను హారిక అండ్ హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. (సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ఆరోగ్యంపై వార్తలు.. స్పందించిన పీఆర్‌ టీమ్‌)