
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నరేంద్ర అనే నూతన దర్శకుడి ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీకి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహిళలపై ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా జరిగే దాడులను ఈ సినిమాలో విశ్లేషాత్మకంగా చూపించనున్నారని సమాచారం.
ఈస్ట్కోస్ట్ బ్యానర్పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్, నదియా, రాజేంద్రప్రసాద్, కమల్ కమారాజు, భానుశ్రీ మెహ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.