డిప్రెషన్లోకి వెళ్తున్నా.. నేను చనిపోతే అతడే కారణం
డిప్రెషన్లోకి వెళ్తున్నానని.. తాను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే దానికి కారణం అతడేనంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ భోజ్పురి నటి రాణి ఛటర్జీ.
డిప్రెషన్లోకి వెళ్తున్నానని.. తాను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే దానికి కారణం అతడేనంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ భోజ్పురి నటి రాణి ఛటర్జీ. ఈ మేరకు ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసిన రాణి.. “ఫేస్బుక్లో ధనంజయ్ సింగ్ అనే వ్యక్తి నన్ను వేధిస్తున్నాడు. లావుగా ఉన్నావు, ముసలిదానా.. అంటూ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నాడు. చెప్పడానికి వీలు లేని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నాడు. చాలా రోజులుగా వీటిని పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నించా. కానీ ఇప్పుడు నా వల్ల అవ్వడం లేదు. డిప్రెషన్లోకి వెళుతున్నా. ఏదైనా చేసుకొని చనిపోతే అందుకు ధనుంజయ్ సింగ్నే కారణం అని పేర్కొంది.
కాగా ఈ విషయం గురించి ఇప్పటికే రాణీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. అయితే ధనుంజయ్ చేసిన పోస్టుల్లో నటి పేరు ప్రస్తావించకపోవడంతో అతనిపై చర్యలు తీసుకోలేమని పోలీసులు చెప్పారట. ఇక తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధనుంజయ్ సింగ్ పోస్టుల స్క్రీన్షాట్లను సైతం ఆమె పోస్ట్ చేశారు.