మోహన్‌బాబుపై సంచలన ఆరోపణలు చేసిన దాసరి కోడలు

| Edited By:

Mar 23, 2019 | 2:03 PM

దర్శకరత్న దాసరి నారాయణరావు ఆస్తుల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. నటుడు మోహన్ బాబు మీద సంచలన ఆరోపణలు చేశారు దాసరి కోడలు సుశీల. ఆస్తుల విషయంలో పెద్దమనిషిగా పంపకాలు జరుపుతానన్న మోహన్ బాబు.. తమకు అన్యాయం చేశారని విమర్శలు చేశారామె. ఇక తన మరిది అరుణ్ కుమార్ సైతం ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలిపారు సుశీల. అయితే ఆస్తుల పంపక విషయాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారని ఆరోపించారు. అరుణ్‌ని అడిగితే మోహనబాబు రావాలంటున్నారని.. ఇదే విషయం ఆయనకు […]

మోహన్‌బాబుపై సంచలన ఆరోపణలు చేసిన దాసరి కోడలు
Follow us on

దర్శకరత్న దాసరి నారాయణరావు ఆస్తుల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. నటుడు మోహన్ బాబు మీద సంచలన ఆరోపణలు చేశారు దాసరి కోడలు సుశీల. ఆస్తుల విషయంలో పెద్దమనిషిగా పంపకాలు జరుపుతానన్న మోహన్ బాబు.. తమకు అన్యాయం చేశారని విమర్శలు చేశారామె.

ఇక తన మరిది అరుణ్ కుమార్ సైతం ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలిపారు సుశీల. అయితే ఆస్తుల పంపక విషయాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారని ఆరోపించారు. అరుణ్‌ని అడిగితే మోహనబాబు రావాలంటున్నారని.. ఇదే విషయం ఆయనకు చెబితే తనకేం సంబంధమని అంటున్నారని చెప్పారు సుశీల.

మరోవైపు తమ కుటుంబం వివాదంలోకి మోహన్ బాబును లాగడం పెద్ద కుట్ర ఉందని తను భావిస్తున్నట్లు దాసరి అరుణ్ కుమార్ తెలిపారు. సుశీల ఏదైనా ఉంటే తనతో చెప్పాలని.. అనవసరంగా దాసరి పేరు లాగుతూ మీడియా ముందుకు వెళ్లడం మంచిది కాదని అన్నారాయన. తన తండ్రి చనిపోయాక మోహన్ బాబు తమ ఫ్యామిలీకి పెద్దదిక్కుగా ఉన్నారని చెప్పుకొచ్చారు అరుణ్ కుమార్.