వివాదంలో అనుష్క శర్మ.. ఫిర్యాదు నమోదు..!

| Edited By:

May 23, 2020 | 10:27 PM

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై అరుణాచల్‌లో గూర్ఖా కమ్యూనిటీకి చెందిన కొంతమంది కేసు నమోదు చేశారు.

వివాదంలో అనుష్క శర్మ.. ఫిర్యాదు నమోదు..!
Follow us on

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై అరుణాచల్‌లో గూర్ఖా కమ్యూనిటీకి చెందిన కొంతమంది కేసు నమోదు చేశారు. కాగా అనుష్క శర్మ తన క్లీన్‌ స్లేట్ ప్రొడక్షన్‌పై పాతాల్ లోక్‌ అనే వెబ్‌ సిరీస్‌ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ఇటీవల అమెజాన్‌లో విడుదల కాగా.. సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. అందులో ఓ డైలాగ్‌ తమ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని గూర్ఖా యూత్ అసోసియేషన్ ఆన్‌లైన్‌లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఈ నెల 18న ఫిర్యాదు చేసింది.

అందులోని పాతాల్‌ లోక్‌లోని రెండో ఎపిసోడ్‌లో ఓ మహిళపై అభ్యంతరకర పదాలను వాడారని, ఇవి తమ కమ్యూనిటీని కించరిచేలా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో వెబ్‌ సిరీస్‌ని నిర్మించిన అనుష్క శర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆ సన్నివేశాన్ని మ్యూట్‌ చేయాలని, డిస్క్లైమర్‌ వేయాలని ఈ వారం ప్రారంభంలో భారతీయ గూర్ఖా యువ పరిషంగ్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో క్యాంపైన్ జరిగిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత..!