మహేశ్ బాబు, సుకుమార్‌ల మధ్య గొడవ

|

Mar 06, 2019 | 6:48 AM

హైదరాబాద్: ‘భరత్ అనే నేను’ సినిమాతో స్టార్ హీరో మహేశ్ బాబు, రంగస్థలం సినిమాతో డైరెక్టర్ సుకుమార్ జోష్ మీద ఉన్నారు. వీరి తదుపరి చిత్రం కూడా అలాగే హిట్ కావాలని, అంతకంటే హిట్ కావాలని కోరుకోవడం సహజమే. ఫ్యాన్స్ కూడా అలానే ఆలోచిస్తారు. అయితే ఈ క్రమంలో నేనొక్కడినే మూవీ తర్వాత మహేశ్, సుకుమార్ కాంబోలో మరో మూవీ వస్తుందని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ అది మహేశ్ బాబు ప్రకటనతో కుదరదని తేలిపోయింది. తనకూ, […]

మహేశ్ బాబు, సుకుమార్‌ల మధ్య గొడవ
Follow us on

హైదరాబాద్: ‘భరత్ అనే నేను’ సినిమాతో స్టార్ హీరో మహేశ్ బాబు, రంగస్థలం సినిమాతో డైరెక్టర్ సుకుమార్ జోష్ మీద ఉన్నారు. వీరి తదుపరి చిత్రం కూడా అలాగే హిట్ కావాలని, అంతకంటే హిట్ కావాలని కోరుకోవడం సహజమే. ఫ్యాన్స్ కూడా అలానే ఆలోచిస్తారు. అయితే ఈ క్రమంలో నేనొక్కడినే మూవీ తర్వాత మహేశ్, సుకుమార్ కాంబోలో మరో మూవీ వస్తుందని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ అది మహేశ్ బాబు ప్రకటనతో కుదరదని తేలిపోయింది. తనకూ, సుకుమార్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా తదుపరి సినిమా ఆగిపోయిందని మహేశ్ వెల్లడించారు. సుకుమార్ తదుపరి చిత్రానికి ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పారు.

ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది..?
ఈ నేపథ్యంలో మహేశ్ బాబు, సుకుమార్‌ల మధ్య పెద్ద తేడాలే వచ్చాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా స్క్రిప్ట్ విషయంలో మహేశ్ బాబు కొన్ని మార్పులు సూచించారని, కుదరదని సుకుమార్ పట్టుబట్టడం వల్లనే చేసేది లేక మహేశ్ ప్రాజెక్ట్ వదులుకున్నాడనే వాదనను కూడా మహేశ్ ఫ్యాన్స్ వినిపిస్తున్నారు. అయితే నిజంగానే స్క్రిప్ట్ విషయమా? లేక వేరే కారణముందా అనేది తెలియాల్సి ఉంది.