
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాక్షసుడు’. తమిళ హిట్ మూవీ ‘రత్ససన్’కు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇక తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాని జూన్ 21న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తోందట చిత్ర యూనిట్.
గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్ బ్యానర్ పై యంగ్ హీరో హవీష్ నిర్మిస్తున్నాడు. కాగా ‘సీత’ సినిమాతో మరో ప్లాప్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.