అమీర్ ‘మహాభారతం’ కోసం విజయేంద్ర ప్రసాద్.. మరి జక్కన్న మాటేంటి..!
హిందువులకు పంచమ వేదంగా పరిగణించే భారత ప్రముఖ ఇతిహాసం 'మహాభారతం'. ఇందులోని పలు అధ్యాయాల ఆధారంగా ఇప్పటికే పలు భాషల్లో సినిమాలు తెరకెక్కాయి.
హిందువులకు పంచమ వేదంగా పరిగణించే భారత ప్రముఖ ఇతిహాసం ‘మహాభారతం’. ఇందులోని పలు అధ్యాయాల ఆధారంగా ఇప్పటికే పలు భాషల్లో సినిమాలు తెరకెక్కాయి. అయితే ‘మహాభారతం’ మొత్తం ఇంతవరకు ఎవ్వరూ తెరపైన చూపించలేకపోయారు. ఇక ఆ మధ్యన ‘మహాభారతం’లో నటించాలనుకున్న మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్, ఆ ప్రాజెక్ట్ను ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన వెయ్యి కోట్ల ఆ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే మహాభారతాన్ని తమ డ్రీమ్ ప్రాజెక్ట్గా పెట్టుకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. ప్రస్తుతం ఆ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అమీర్ మహాభారతం కోసం స్క్రిప్ట్ను రెడీ చేసే పనిలో ఉన్నారు జక్కన్న తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్.
ఈ విషయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు. అమీర్ఖాన్ మహా భారతంలో తాను భాగమయ్యానని తెలిపారు. అయితే స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ అవ్వలేదని, ఈ ప్రాజెక్ట్ గురించి ముందే మాట్లాడలేనని అన్నారు. కాగా రాజమౌళి అన్ని చిత్రాలకు విజయేంద్ర ప్రసాద్నే కథను అందిస్తుంటారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు అమీర్ మహాభారతం కోసం ఆయన పనిచేస్తే.. జక్కన్న మాటేంటని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహాభారతం అన్నది జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా కాబట్టి. ఈ విషయాన్ని రాజమౌళి కూడా పలుమార్లు వెల్లడించారు. అయితే విజయేంద్ర స్టేట్మెంట్ నేపథ్యంలో మరో వార్త కూడా ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే అమీర్ మహాభారతానికి రాజమౌళి దర్శకత్వం వహించబోతున్నారని. అందుకే విజయేంద్ర ప్రసాద్ కథను రెడీ చేస్తున్నారని. మరి ఇందులో నిజమెంత..? మహాభారతంను ఎవరు తెరకెక్కిస్తారు..? ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే చాలా రోజులు ఆగాల్సిందే.
Read This Story Also: ప్రజాప్రతినిధుల్లో ‘కరోనా’ టెన్షన్.. హోమ్ క్వారంటైన్లో పలువురు