టాలీవుడ్ చిన్న సినిమాపై కన్నేసిన బాలీవుడ్ పెద్దహీరో.. ఫ్యాన్సీ రేట్ తో హక్కులను సొంతం చేసుకున్న అజయ్‌దేవగన్

ఇటీవల టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లోను రీమేక్ అవుతూ భారీ హిట్లు అవుతున్న విషయం తెలిసిందే. కథలో విషయం ఉంటే బాలీవుడ్ కు తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలు.

టాలీవుడ్ చిన్న సినిమాపై కన్నేసిన బాలీవుడ్ పెద్దహీరో.. ఫ్యాన్సీ రేట్ తో హక్కులను సొంతం చేసుకున్న అజయ్‌దేవగన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 18, 2020 | 6:07 PM

ఇటీవల టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లోను రీమేక్ అవుతూ భారీ హిట్లు అవుతున్న విషయం తెలిసిందే. కథలో విషయం ఉంటే బాలీవుడ్ కు తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలు. ఇప్పటికే టాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ హిందీలో ‘కబీర్ సింగ్’ గా మారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. త్వరలో నాని నటించిన ‘జర్సీ’ సినిమాకూడా అక్కడ రీమేక్ అవ్వనుంది. ఇప్పటికే ‘జర్సీ’ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసాడు హీరో షాహిద్ కపూర్. ఈ క్రమంలో మరో తెలుగు సినిమాకూడా త్వరలో హిందీలోకి వెళ్లనుందని తెలుస్తుంది.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ మంచి టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ బాట పట్టనుంది. స్టార్ హీరో అజయ్ దేవగన్ ఫ్యాన్సీ రేట్ ఇచ్చి హిందీ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడట. తన హోమ్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నాడు అజయ్ దేవగన్. ఈ మూవీలో హీరోలుగా అజయ్ దేవగంతో పాటు అభయ్ డియోల్ కరణ్ డియోల్ నటించనున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీకి ‘వెల్లీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. మరి ఈ సినిమా బాలీవుడ్ లో ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి.