ఇంట్లో వరుస మరణాలు.. మనసును కదిలించే ఐశ్వర్య రియల్ స్టోరీ..!

| Edited By:

May 25, 2020 | 1:12 PM

అందం, అభినయం కలిసి ఉన్న హీరోయిన్ల లిస్ట్‌లో ఐశ్వర్య రాజేష్‌ కచ్చితంగా ఉంటుంది. ఏదో ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఈ హీరోయిన్‌ సినిమాలు చేయదు. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే స్టార్ హీరో సినిమాలను వదులుకోవడానికి కూడా ఈ హీరోయిన్‌ ఏ మాత్రం వెనకాడదు. అందుకే ఈ హీరోయిన్‌ లిస్ట్‌లో హిట్లు కూడా బాగానే ఉన్నాయి. కాగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను పొందుతున్నప్పటికీ, చిన్న వయసులోనే ఈ హీరోయిన్ చాలా కష్టాలే చూసింది. ముఖ్యంగా […]

ఇంట్లో వరుస మరణాలు.. మనసును కదిలించే ఐశ్వర్య రియల్ స్టోరీ..!
Follow us on

అందం, అభినయం కలిసి ఉన్న హీరోయిన్ల లిస్ట్‌లో ఐశ్వర్య రాజేష్‌ కచ్చితంగా ఉంటుంది. ఏదో ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఈ హీరోయిన్‌ సినిమాలు చేయదు. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే స్టార్ హీరో సినిమాలను వదులుకోవడానికి కూడా ఈ హీరోయిన్‌ ఏ మాత్రం వెనకాడదు. అందుకే ఈ హీరోయిన్‌ లిస్ట్‌లో హిట్లు కూడా బాగానే ఉన్నాయి. కాగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను పొందుతున్నప్పటికీ, చిన్న వయసులోనే ఈ హీరోయిన్ చాలా కష్టాలే చూసింది. ముఖ్యంగా తన తండ్రి ఆకస్మిక మరణంతో ఆర్థిక సమస్యలు కూడా ఎన్నో ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఈ స్టేజ్‌కి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ ఇంటర్యూలో తన చిన్నతనం గురించి వివరించింది ఈ నటి.

‘చెన్నైలో అందరూ స్లమ్‌గా పిలిచే ఓ ప్రాంతంలో మేము చిన్న వయస్సులో నివాసం ఉండే వాళ్లం. నాకు 8 ఏళ్లు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. 11-12 ఏళ్లు ఉన్నప్పుడు పెద్దన్నయ్య మరణించారు. ఆ తరువాత ఒకటి, ఒకటిన్నర సంవత్సరానికే ఇంకో అన్నయ్య రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నా జీవితంలో ఆ ఫేజ్‌ చాలా బాధతో కూడుకొన్నది. నా కుటుంబానికి ఎలాంటి సపోర్ట్ లేదు. ఆ తరువాత నేనే సీరియల్స్‌కు పనిచేయడం ప్రారంభించాను. కానీ నాకు చాలా తక్కువ డబ్బులు వచ్చేది. ఆ సమయంలో సినిమాల్లో చేయమని మా అమ్మ సూచించారు. నా కుటుంబానికి మద్దతు ఇవ్వడం కోసం నేను సినిమాల్లో ఆఫర్ల కోసం ప్రయత్నించా’ అని ఐశ్వర్య తెలిపింది. ఆ సమయంలో తనకు ఎవరూ మద్దతు ఇవ్వలేదని, తనను ఎవరూ నమ్మలేదని, తనను తానే సపోర్ట్ ఇచ్చుకున్నానని ఐశ్వర్య పేర్కొంది. కాగా ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ అప్పట్లో నటుడిగా పలు చిత్రాల్లో నటించారు. ప్రముఖ కమెడియన్ శ్రీలక్ష్మి ఈమెకు మేనత్త.

Read This Story Also: కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో కొత్తగా 44 కేసులు..!