
ప్రపంచవేదికపై మారుమోగిన ‘నాటు నాటు’ బీట్ ఇంకా చెవుల్లోనే మోగుతోంది… కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన నటన ఇంకా మరువనేలేదు. ఎస్.ఎస్. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో సృష్టించిన ఆ మాయాజాలం మూడేళ్లైనా మనసుల్ని వదల్లేదు.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మళ్లీ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఎలా ఉంటుంది? అనే ప్రశ్న అభిమానుల్లో మెదులుతూనే ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరోసారి తారక్-చెర్రీ కాంబో కోసం ప్రేక్షకులు ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపుకు త్వరలో సమాధానం దొరికే అవకాశం కనిపిస్తోంది!
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ను పాన్ఇండియా స్థాయిలో రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ పూర్తైన తర్వాత భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట. ఆర్ఆర్ఆర్తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్లను మరోసారి ఒకే ఫ్రేమ్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట.
Ntr & Tarak N Nelson
సన్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతున్న ‘జైలర్ 2’లో రజనీకాంత్తో పాటు మోహన్లాల్, శివరాజ్కుమార్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్న నేపథ్యంలో, ఈ చిత్రం పూర్తయ్యాకే నెల్సన్ తన తదుపరి ప్రాజెక్ట్ను ఫైనలైజ్ చేస్తాడని తెలుస్తోంది. అయితే ఆ ప్రాజెక్ట్లో హీరోలుగా ఎన్టీఆర్ & రామ్ చరణ్లను లాక్ చేయాలని ఆయన గట్టి ప్లాన్తో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్.
ఈ కథాంశాన్ని నెల్సన్ ఇద్దరు హీరోలకూ ఇప్పటికే నేరేట్ చేశాడని, వారిద్దరూ ఈ ఐడియాకు ఎంతో పాజిటివ్గా స్పందించారని సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు స్టార్లను ఒకే ఫ్రేమ్లో చూడాలని దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో, నెల్సన్ ప్లాన్ నిజమైతే ఇది పాన్ఇండియా స్థాయిలో భారీ సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఈ మల్టీస్టారర్ ఒక్కసారి అనౌన్స్ అయితే బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే స్థాయి హైప్ క్రియేట్ అవుతుందనడంలో సందేహం లేదు!