Nayanthara: ‘అది నా జీవితాన్నే మార్చేసింది’.. భర్తకు థ్యాంక్స్ చెప్పిన నయన్
సినిమా ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ లో నయనతార, విఘ్నేశ్ లు ఒకరు. స్నేహంతో మొదలైన వీరి బంధం పెళ్లి వరకు వెళ్లింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన నయనతార తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఈ పోస్టులో భర్త విఘ్నేష్ కు ధన్యవాదాలు తెలిపింది. ఇంతకీ ఎందకనేగా మీ సందేహం..
సినిమా ఇండస్ట్రీకి చెందిన క్యూట్ కపుల్స్ నయనతార-విఘ్నేశ్లు ఒకరు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. 2021లో తాము ప్రేమలో ఉన్నట్లు ప్రపంచానికి తెలిపిన ఈ జంట 2022 జూన్ 9న వివాహం చేసుకున్నారు. ఇక జంటకు ఉయిర్, ఉలమగ్ అనే ఇద్దరు ట్విన్స్ ఉన్నారు. ప్రస్తుతం నయనతార సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఎంచక్కా పిల్లలు, భర్తతో హ్యాపీగా గడుపుతోంది.
సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం నిత్యం టచ్లోనే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటోంది. ఇక ఈ క్యూట్ కపుల్ మధ్య ప్రేమ చిగురించనడానికి కారణమైన ప్రత్యేక క్షణాన్ని తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది నయనతార. విఘ్నేష్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్గా వచ్చిన ‘నేను రౌడినే’ సినిమా విడుదలై 9 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని వివరాలను నయనతార పంచుకుంది. కొన్ని మూవీ స్టిల్స్తో కూడిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన రాసుకొచ్చింది.
నయన్ పోస్ట్ చేస్తూ.. ‘ఈ సినిమా నా జీవితాన్ని మార్చిసింది. నా కెరీర్ను గొప్పగా మలుపుతిప్పిన సినిమా ‘నేను రౌడినే’. 9ఏళ్ల కిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్కు కృతజ్ఞతలు. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు విఘ్నేశ్ను ఇచ్చింది’ అని రాసుకొచ్చిందీ బ్యూటీ.
నయనతార చేసిన పోస్ట్..
View this post on Instagram
ఈ సినిమా తర్వాతే నయనతార, విఘ్నేశ్ల మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారి, వివాహానికి దారి తీసింది. గతంలో సినిమా గురించి విఘ్నేష్ మాట్లాడుతూ.. ‘‘నేను రౌడినే’ సినిమాలో హీరోయిన్గా నయనతార అయితే బాగుంటుందని ధనుష్ చెప్పారు. దీంతో ఆమెకు కథ వినిపించాను. వెంటనే ఓకే చేసింది. చిత్రీకరణకు సంవత్సరం పట్టింది. ఆ ఏడాదంతా ఆమెతో ఉండే అవకాశం వచ్చింది. తన ఇష్టాయిష్టాలను తెలుసుకునే సమయం దొరికింది’ అని తన మనసులో మాట చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..