ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరొకరు సీరియస్

అతివేగం రెండు ప్రాణాలను బలితీసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు, రెండు బైకులు ఢీనకొడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరొకరు సీరియస్
Follow us

|

Updated on: Aug 11, 2020 | 6:23 PM

అతివేగం రెండు ప్రాణాలను బలితీసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు, రెండు బైకులు ఢీనకొడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై కారు, రెండు బైకులు ఢీ కొన్నాయి. ప్రమాదంలో జడ్చర్లకు చెందిన ఎడ్ల శ్రీనివాస్ గౌడ్(45), శేఖర్(42) మృతి చెందారు. రాజు అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ రాజును మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.