AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతి ట్రాప్.. ఆ తర్వాత ఫొటోలు తీసి..

Prakasam District Crime News: ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో దారుణం జరిగింది. తెలిసిన వ్యక్తే కదా అని నమ్మితే నట్టేట ముంచాడు. స్నేహితురాలి బర్త్‌ డే కు వెళ్తున్నామని చెప్పి బైక్‌పై

AP Crime: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతి ట్రాప్.. ఆ తర్వాత ఫొటోలు తీసి..
Shaik Madar Saheb
|

Updated on: Apr 16, 2022 | 7:29 AM

Share

Prakasam District Crime News: ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో దారుణం జరిగింది. తెలిసిన వ్యక్తే కదా అని నమ్మితే నట్టేట ముంచాడు. స్నేహితురాలి బర్త్‌ డే కు వెళ్తున్నామని చెప్పి బైక్‌పై వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు ఓ కామాంధుడు. బర్త్‌ డేను సాకుగా చేసుకుని పక్కా ప్లాన్‌ ప్రకారం ఓ యువతి ని ట్రాప్‌ చేశాడు. ఆమె ఎటు వెళ్తోంది? ఏం చేస్తుందో గమనిస్తూనే తన పథకాన్ని అమల్లో పెట్టాడు. దీంతో స్నేహితురాలి బర్త్‌ డేకు వెళ్తున్నామనుకున్న బాధితురాలు వాళ్లు వేసిన వలలో పడుతున్నానని గుర్తించలేకపోయింది. స్పేహితురాలి పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నామని బైక్‌పై యువతిని తీసుకెళ్లిన కామాంధుడు ఆ యువతి పట్ల మోసపూరితంగా వ్యవహరించాడు. ఆమె జీవితంతో ఆడుకున్నాడు.

కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించి ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసి సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీశాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితుడికి కూడా ఈ ఫొటోలను చూపించాడు. వాటిని కాస్తా ఆ ప్రభుద్దుడు సోషల్‌ మీడియాలో పెట్టడంతో బాధిత యువతి అల్లాడిపోయింది. జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు దోర్నాల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను దోర్నాలలోని కటకానిపల్లెకు చెందిన మీరావలి, రసూల్‌గా గుర్తించారు. మార్కాపురంలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని నిందితులను అరెస్ట్‌ చేశామని దోర్నాల పోలీసులు తెలిపారు.

Also Read:

ప్రాణం తీసిన ఈత సరదా.. రిజర్వాయర్ లో మునిగి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

Tirumala: అంచనాలు తప్పడంతోనే తోపులాట.. దేవున్నీ రాజకీయాల్లోకి లాగుతున్నారన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి