జెండా పోల్‌కు కరెంట్ షాక్..ఇద్దరు విద్యార్థులు మృతి

|

Aug 15, 2019 | 7:03 PM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జాతీయ జెండా స్తంభానికి కరెంట్ షాక్ కొట్టడంతో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు చనిపోయారు. గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లా కెన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. త్రివర్ణ పతాక ఆవిష్కరణ కోసం లోహపు జెండా స్తంభాన్ని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు అది విద్యుత్ తీగలకు తగలింది. దాంతో జెండా స్తంభాన్ని పట్టుకున్న విద్యార్థులకు షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పదోతరగతి విద్యార్థులు దిలీప్ రాణా(15), గణపత్ వాల్వాయ్ (15) చనిపోయారు. […]

జెండా పోల్‌కు కరెంట్ షాక్..ఇద్దరు విద్యార్థులు మృతి
Two Class 10 Students Die of Electric Shock from Flag Hoisting Pole
Follow us on

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జాతీయ జెండా స్తంభానికి కరెంట్ షాక్ కొట్టడంతో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు చనిపోయారు. గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లా కెన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. త్రివర్ణ పతాక ఆవిష్కరణ కోసం లోహపు జెండా స్తంభాన్ని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు అది విద్యుత్ తీగలకు తగలింది. దాంతో జెండా స్తంభాన్ని పట్టుకున్న విద్యార్థులకు షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పదోతరగతి విద్యార్థులు దిలీప్ రాణా(15), గణపత్ వాల్వాయ్ (15) చనిపోయారు.

మృతుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే వారు చనిపోయారంటూ రోదిస్తున్నారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.