కారు డోర్ లాక్…ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
కారు డోర్ లాకవ్వడంతో అందులో ఉన్న నలుగురు చిన్నారుల్లో ఇద్దరు పిల్లలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వయసున్న నలుగురు పిల్లలు ఇంటి ముందున్న కారులో ఆడుకుంటుండగా ఉన్నట్టుండి కారు డోర్ లాకయ్యింది.
కారు డోర్ లాకవ్వడంతో అందులో ఉన్న నలుగురు చిన్నారుల్లో ఇద్దరు పిల్లలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని మొరాదాబాద్లో మంగళవారం చోటుచేసుకుంది. నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వయసున్న నలుగురు పిల్లలు ఇంటి ముందున్న కారులో ఆడుకుంటుండగా ఉన్నట్టుండి కారు డోర్ లాకయ్యింది. ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు.
కొంత సమయం తర్వాత పిల్లలు కనిపించకపోవడంతో ఇంటి సభ్యులంతా వెతికారు. కాసేపటికి పిల్లలు కారులో ఇరుక్కుపోయారని గుర్తించి… వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి చూడగా.. నలుగురు పిల్లలు అపస్మారకస్థితిలో ఉన్నారు. హుటాహుటిన వారందరిని స్థానిక ఆస్పత్రికి తరలించగా… పరీక్షించిన వైద్యులు ఇద్దరు పిల్లలు మరణించారని ధృవీకరించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలంతా ఒకే కుటుంబానికి చెందినవారుకావడంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.