AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: కృష్ణాజిల్లాలో పండుగపూట తీవ్ర విషాదం.. ఆడుకుంటూ చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి

Tragedy: కృష్ణాజిల్లాలో పండుగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆట సరదా నలుగురి ప్రాణాలను తీసింది. కైకలూరు మండలం వరాహపట్నంలో ఈ ఘటన జరిగింది.

Crime News: కృష్ణాజిల్లాలో పండుగపూట తీవ్ర విషాదం.. ఆడుకుంటూ చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి
Swim Death
Balaraju Goud
|

Updated on: Oct 14, 2021 | 6:10 PM

Share

Krishna District Tragedy: కృష్ణాజిల్లాలో పండుగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆట సరదా నలుగురి ప్రాణాలను తీసింది. కైకలూరు మండలం వరాహపట్నంలో ఈ ఘటన జరిగింది. వరాహపట్నం గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులుఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. దీంతో ఈత రాక నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు బాలికలు, ఒక బాలుడు గా గుర్తించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఈ విషాద ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దసరా పండుగ వేడుకల్లో ఉన్న గ్రామం.. చిన్నారుల మృతితో శోకసంద్రంగా మారిపోయింది.

Read Also… Hyderabad Metro: మెట్రోలో ప్రయాణించే వారికి బంపరాఫర్.. నెలనెలా లక్కీ డ్రా.. మరెన్నో ఆఫర్లు.. ఎప్పటినుంచంటే..?

మిడిల్ ఆర్డర్‌లో తడబాటు.. ఓపెనర్‌గా మారి అద్భుతాలు.. ఏడాదిలో 11 సెంచరీలు.. కొత్త షాట్‌తో బౌలర్లను భయపెట్టిన ప్లేయర్ ఎవరంటే?