యూపీలోని ఝాన్సీలో దారుణం, సివిల్స్ పరీక్ష జరుగుతుండగానే ,

యూపీలోని ఝాన్సీలో అత్యంత దారుణం జరిగింది. ఈ నెల 11 న ఓ పాలిటెక్నీక్  కాలేజీలో సివిల్ సర్వీసుల పరీక్ష జరుగుతుండగానే.. 17 ఏళ్ళ బాలికపై అత్యాచారం జరిపారు.

యూపీలోని ఝాన్సీలో దారుణం, సివిల్స్ పరీక్ష జరుగుతుండగానే ,
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 12, 2020 | 12:16 PM

యూపీలోని ఝాన్సీలో అత్యంత దారుణం జరిగింది. ఈ నెల 11 న ఓ పాలిటెక్నీక్  కాలేజీలో సివిల్ సర్వీసుల పరీక్ష జరుగుతుండగానే.. 17 ఏళ్ళ బాలికపై అత్యాచారం జరిపారు. తన బాయ్ ఫ్రెండ్ ను కలుసుకోవడానికి వెళ్లిన ఆమెను సుమారు డజను మంది విద్యార్థులు బలవంతంగా లాక్కుపోయారు. ఆమె బాయ్ ఫ్రెండును కొట్టారు. వారిలోఒకడు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడగా ఇతర విద్యార్థులు వీడియో తీశారు. కాలేజీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నప్పటికీ ఈ ఘోరం జరిగింది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు భరత్ అనే విద్యార్థితో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇతరులకోసం గాలిస్తున్నారు.