AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: ఆవిరైన ఆనందం.. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఆరుగురు మృతి

కుటుంబసభ్యులతో కలిసి దైవ దర్శనానికి బయల్దేరారు. ఇష్టదైవాన్ని దర్శించుకుని సంతోషంగా ఇంటికి పయనమయ్యారు. మరి కొద్ది సమయంలో స్వగ్రామానికి చేరుకుంటామనగా ఊహించని రూపంలో ప్రమాదం ఎదురైంది. కుటుంబసభ్యులందరినీ కబళించేసింది...

Karnataka: ఆవిరైన ఆనందం.. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఆరుగురు మృతి
Karnataka Accident
Ganesh Mudavath
|

Updated on: Aug 05, 2022 | 11:01 AM

Share

కుటుంబసభ్యులతో కలిసి దైవ దర్శనానికి బయల్దేరారు. ఇష్టదైవాన్ని దర్శించుకుని సంతోషంగా ఇంటికి పయనమయ్యారు. మరి కొద్ది సమయంలో స్వగ్రామానికి చేరుకుంటామనగా ఊహించని రూపంలో ప్రమాదం ఎదురైంది. కుటుంబసభ్యులందరినీ కబళించేసింది. కారును లారీ ఢీ కొట్టడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిలో 6 నెలల చిన్నారి ఉండటం ఆవేదన కలిగిస్తోంది. కర్ణాటకలోని (Karnataka) రాయచూర్ జిల్లా లింగసుగుర్ మండలంలోని హట్టి గ్రామానికి చెందిన మహ్మద్​మఝర్ హుస్సేన్ తన కుటుంబసభ్యులతో కలిసి దైవ దర్శనం కోసం పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు (Telangana) వచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ సమీపంలో ఉన్న ఓ దర్గాను దర్శించుకుని గురువారం రాత్రి స్వగ్రామానికి బయల్దేరాడు. తిరిగి వెళ్తుండగా గురమిట్కల్​ మండలం అరెకేరా వద్ద వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 6 నెలల చిన్నారితో పాటు మరో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడ్ని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. యాక్సిడెంట్ జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ న్యూస్ చదవండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి