AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sepoy Laxman Killed: జమ్మూ కశ్మీర్‌లో దారుణం.. పాకిస్తాన్ కాల్పుల్లో మరో భారత సైనికుడి వీర మరణం..

Sepoy Laxman Killed: జమ్మూ కశ్మీర్‌‌లోని రాజౌరి నియంత్రణ రేఖ వద్ద మరోసారి పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించింది. భారత

Sepoy Laxman Killed: జమ్మూ కశ్మీర్‌లో దారుణం.. పాకిస్తాన్ కాల్పుల్లో మరో భారత సైనికుడి వీర మరణం..
uppula Raju
|

Updated on: Feb 04, 2021 | 8:28 AM

Share

Sepoy Laxman Killed: జమ్మూ కశ్మీర్‌‌లోని రాజౌరి నియంత్రణ రేఖ వద్ద మరోసారి పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించింది. భారత సైన్యంపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది. దీంతో ఓ భారత సైనికుడు వీర మరణం పొందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజౌరి జిల్లాలోని సుందర్‌బని సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ దళాలు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాయి.

దీంతో భారతసైన్యం దీటుగా స్పందించింది. ఈ కాల్పుల్లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌‌కు చెందిన సైనికుడు లక్ష్మణ్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. కాగా ఈ ఏడాది నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతిచెందిన సైనికుల్లో లక్ష్మణ్ నాలుగోవాడు. గతంలో మరో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా లక్ష్మణ్ ఎంతో ధైర్యవంతుడని, నిజాయితీగల సైనికుడని అధికారులు కొనియాడారు. అతడి త్యాగం మరియు విధి పట్ల ఉన్న భక్తికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.

Bumper Jackpot Video: కల నిజమయింది.. కాసుల వర్షం కురిసింది.. రాత్రికి రాతే కోటీశ్వరుల్ని చేసింది