రెండు నెలల క్రితం పూడ్చిన మృతదేహం.. అల్లుడి అతితో వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలు ట్విస్ట్ ఇదే.!

|

Mar 03, 2021 | 6:41 PM

తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఓ కూతురు జిల్లా ఎస్సీని ఆశ్రయించింది. కూతురి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు..

రెండు నెలల క్రితం పూడ్చిన మృతదేహం.. అల్లుడి అతితో వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలు ట్విస్ట్ ఇదే.!
Follow us on

తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఓ కూతురు జిల్లా ఎస్సీని ఆశ్రయించింది. కూతురి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు..రెండు నెలల క్రితం చనిపోయిన బాధితురాలి తల్లి మృతదేహనికి తిరిగి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ షాకింగ్ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.

తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నజీమా బేగం కొద్దికాలంగా కామారెడ్డి పట్టణం అశోక్‌నగర్‌లోని తన కూతురు వద్దే ఉంటోంది. గత డిసెంబర్‌లో నజీమా హఠాన్మరణం చెందింది. గుండెపోటుతో చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. అత్త చనిపోయి రెండు నెలలు తిరగకుండానే ఆమె ఆస్తులపై అల్లుడి కన్ను పడింది. ఆస్తులు అమ్మేద్దామంటూ ఒత్తిడి చేయడంతో కూతురికి అనుమానమొచ్చింది. తల్లి ఒంటిపై గాయాలు కూడా గుర్తుకొచ్చి తన తల్లిని హత్య చేశారంటూ పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది.

తన తల్లిని భర్త, మేనమామ కలిసి హతమార్చారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 75 రోజుల తర్వాత నజీమా మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసు విచారణలో అసలు నిజాలు తేలాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

లోదుస్తులను మాస్క్‌గా ధరించిన మహిళ.. వీడియో వైరల్.. నెట్టింట నవ్వులు పువ్వులు..

పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉంటాను.. నెటిజన్ ప్రశ్నకు ఆషూ ఆన్సర్.. వైరల్ ట్వీట్.!

Bigg Boss Season 5: బిగ్ బాస్ సీజన్ 5.. రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరే.. వివరాలు ఇవే..!