AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కామారెడ్డిలో కలకలం..చెరువులో మ‌ృతదేహం..?

కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద చెరువులో పడి ఓ వ్యక్తి మ‌ృతిచెందాడు.

కామారెడ్డిలో కలకలం..చెరువులో మ‌ృతదేహం..?
Jyothi Gadda
|

Updated on: May 26, 2020 | 6:50 PM

Share

కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద చెరువులో పడి ఓ వ్యక్తి మ‌ృతిచెందాడు. నీళ్లలో బాడీ పైకి తేలటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..మ‌ృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్ధిపేట జిల్లా కేంద్రానికి చెందిన వీరభద్ర నాగరాజు (42) తన రెండో భార్య భాగ్య, కూతురుతో కలిసి కామారెడ్డిలో నివాసముంటున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో గత రెండు నెలల నుండి జంగంపల్లి గ్రామంలో నివాసముంటున్నారు. కాగా, సోమవారం మధ్యాహ్నం నాగరాజు ఇంటి నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం జంగంపల్లి చెరువులో గ్రామస్తులకు మృతదేహం కనిపించడంతో కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.