AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్ లో ‘పరువు హత్య’.మేనత్తను కాల్చి చంపిన 9 ఏళ్ళ కుర్రాడు

పాకిస్తాన్ లో జరిగిందో దారుణం.. తొమ్మిదేళ్ల బాలుడు తన మేనత్తను గన్ తో కాల్చి చంపాడు. గన్ ఫైర్ చేయడంలో అతనికి అతని తండ్రి, కుటుంబమే 'శిక్షణ' ఇచ్చిందట. వివరాల్లోకి వెళ్తే..లాహోర్ కి సుమారు 200 కి.మీ. దూరంలోని సర్గోదా అనే గ్రామమది.

పాకిస్తాన్ లో 'పరువు హత్య'.మేనత్తను కాల్చి చంపిన 9 ఏళ్ళ కుర్రాడు
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 24, 2020 | 1:38 PM

Share

పాకిస్తాన్ లో జరిగిందో దారుణం.. తొమ్మిదేళ్ల బాలుడు తన మేనత్తను గన్ తో కాల్చి చంపాడు. గన్ ఫైర్ చేయడంలో అతనికి అతని తండ్రి, కుటుంబమే ‘శిక్షణ’ ఇచ్చిందట. వివరాల్లోకి వెళ్తే..లాహోర్ కి సుమారు 200 కి.మీ. దూరంలోని సర్గోదా అనే గ్రామమది.  ఆ గ్రామానికి చెందిన 30 ఏళ్ళ ఓ మహిళ సుమారు పదేళ్ల క్రితమే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. తన  కుటుంబానికి ఏ మాత్రం ఇష్టం లేకున్నా ఆమె ఆ వ్యక్తితో పెళ్లి అనంతరం అతనితో కలిసి వెళ్ళిపోయింది. ఈమె తీరును ఆ తరువాత ఈ కుటుంబం అంగీకరించినట్టు నటిస్తూ ఆమెతో సన్నిహిత సంబంధాలను పెంచుకుంది. తన ఫ్యామిలీ మళ్ళీ తనను ఆదరిస్తున్నందుకు ఆమె పొంగిపోయింది. కానీ ఇన్నేళ్లయినా ఆమెపట్ల కుటుంబ సభ్యుల ‘పగ’ చల్లారలేదు. తమ పరువు తీసిందని ఆ కుటుంబం మండిపడుతూనే ఉంది. ఇటీవల ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని, రావాలని కోరగా ఆమె సంబరంగా వచ్చింది. ఇదే అదననుకుని ఆ కుటుంబ పెద్ద తన తొమ్మిదేళ్ల కుమారుడికి గన్ ఇచ్చి ఆమెపై కాల్పులు జరపాలని కోరగా ఆ కుర్రాడు అలాగే కాల్పులు జరపడంతో..ముగ్గురు పిల్లలున్న ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన తరువాత ఆ తొమ్మిదేళ్ల బాలుడితో బాటు ఆ కుటుంబమంతా పరారైంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.

పాకిస్థాన్ లో పరువు హత్యలు పరిపాటి అయిపోయాయని, ఏడాదిలో సుమారు వెయ్యిమంది యువతులు ఇలా పరువు హత్యలకు గురవుతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆక్రోశిస్తున్నాయి. వీటికి చెక్ చెప్పాలని  ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.