భూపాలపల్లి: పురుగుల మందు తాగి తల్లి, కుమార్తె ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు
భూపాలపల్లి: మహదేవ్ పూర్ మండలం కన్నేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి తల్లి, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు తల్లి అశ్విని, కూతురు...
భూపాలపల్లి: మహదేవ్ పూర్ మండలం కన్నేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి తల్లి, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు తల్లి అశ్విని, కూతురు సమతగా గుర్తించారు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుుని పరిశీలించారు. కుటుంబ కలహాలే తల్లీకూతుళ్ల మృతికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే కుటుంబ కలహాలేనా..? ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.