Crime News: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం.. మరో ఇద్దరు..

|

Sep 30, 2021 | 11:38 AM

Meghalaya Accident: మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు

Crime News: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం.. మరో ఇద్దరు..
Meghalaya Accident
Follow us on

Meghalaya Accident: మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు నీటిలో గల్లంతు కాగా.. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మేఘాలయలోని నోంగ్‌చ్రామ్‌ సమీపంలో జరిగింది. బుధవారం అర్థరాత్రి తురా నుంచి షిల్లాంగ్ నగరానికి వెళుతున్న బస్సు.. ప్రమాదవశాత్తు నోంగ్‌చ్రామ్‌లోని రింగ్ది నదిలో పడిపోయింది. వంతనపైనుంచి నీటిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు నలుగరు ప్రయాణికులు మరణించారని పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు గల్లంతైనట్లు పేర్కొంటున్నారు. కాగా.. ప్రమాదం జరిగిన బస్సులో 22 మంది ప్రయాణికులున్నారని ఈస్ట్ గారో హిల్స్ పోలీసులు తెలిపారు.

Also Read:

Crime News: అక్రమ సంబంధం పెట్టుకున్నారని.. వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించారు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Crime News: మరో ఘోరం.. యువతిపై గ్యాంగ్ రేప్.. మద్యం తాగించి దారుణంగా..