AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రోహిణి ప్రాంతంలోని షాబాద్ డెయిరీ స‌మీపంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి మంట‌లు ఒక్క‌సారిగా ఎగ‌సిప‌డ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..
Jyothi Gadda
|

Updated on: Jul 16, 2020 | 3:50 PM

Share

దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రోహిణి ప్రాంతంలోని షాబాద్ డెయిరీ స‌మీపంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి మంట‌లు ఒక్క‌సారిగా ఎగ‌సిప‌డ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మొదట ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మరికొన్ని ఫైర్ ఇంజన్లు తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్ర‌మాదానికి సంబంధించిన కార‌ణాలు ఇంకా తెలియ‌లేద‌ని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీస‌ర్ ధ‌ర‌మ్‌పాల్ భ‌ర‌ద్వాజ్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ మ‌ర‌ణించ‌లేద‌ని వెల్ల‌డించారు. మంట‌లు ప్ర‌స్తుతం అదుపులోకి వ‌చ్చాయ‌ని చెప్పారు.