గాజువాక శ్రీనగర్ కాలనీలో విషాదం.. అద్దె రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట
తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి ఎందరో యువతి, యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రేమ పెళ్లిళ్లను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యలకు...
తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి ఎందరో యువతి, యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రేమ పెళ్లిళ్లను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. తాజాగా గాజువాక శ్రీనగర్ కాలనీలో శుక్రవారం ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పరవాడ మండలం భోనంగి గ్రామానికి చెందిన ఓ యువతి, అవినాష్ (32) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తీరా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో గురువారం గాజువాక శ్రీనగర్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఉదయం 9 అయినా వారు బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని వచ్చి తలుపు కొట్టాడు. ఎంతకి తలుపు తీయకపోవడంతో కిటికిలోంచి చూడగా, ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ విషయాన్ని వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ మల్లేశ్వరరావు తన సిబ్బందిని ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అయితే కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వీరి ఆత్మహత్యపై ఇరు కుటుంబాలను విచారిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.