AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోకల్ లీడర్‌ కాల్చివేత.. ఎక్కడో కాదు..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. మొన్నటి వరకు క్రైం రేటు తగ్గిందనుకున్నారంతా.. కానీ లాక్‌డౌన్ 4.0 నుంచి 5.0 వచ్చే సరికి.. క్రైం రేటు మళ్లీ పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం మండ్వాలీ పార్క్ సమీపంలో ఓ స్థానిక లీడర్‌ను కాల్చి చంపేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మండ్వాలీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఓ పార్క్‌లో ఉదయం 7.30 నిమిషాలకు ఈ సంఘటన […]

లోకల్ లీడర్‌ కాల్చివేత.. ఎక్కడో కాదు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 03, 2020 | 8:17 PM

Share

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. మొన్నటి వరకు క్రైం రేటు తగ్గిందనుకున్నారంతా.. కానీ లాక్‌డౌన్ 4.0 నుంచి 5.0 వచ్చే సరికి.. క్రైం రేటు మళ్లీ పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం మండ్వాలీ పార్క్ సమీపంలో ఓ స్థానిక లీడర్‌ను కాల్చి చంపేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మండ్వాలీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఓ పార్క్‌లో ఉదయం 7.30 నిమిషాలకు ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. దుండుగులు కాల్చి పారిపోయిన వెంటనే.. అతడిని స్థానిక పట్‌పర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడి ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు రాహుల్ బురుగా గుర్తించారు. అతడి శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక మృతుడిపై మండ్వాలీ పోలీస్ స్టేషన్‌లో పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని.. అయితే ఇతడు స్థానిక మున్సిపల్ కార్పోరేషన్‌లో లీడర్‌గా ఉన్నారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది నవంబర్‌లో కూడా ఇతడిపై హత్యాయత్నం జరిగిందని తెలుస్తోంది.