AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 24 మంది మృతి

ఇండోనేషియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రాథమికంగా అందుతోన్న సమాచారం ప్రకారం..మొత్తం 37 మంది ప్రయాణిస్తోన్న బస్సులో.. ఇప్పటికే 24 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 13 మంది తీవ్ర గాయాలవ్వగా, వారిని రెస్క్యూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దక్షిణ సుమత్రా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఏకంగా 150 అడుగుల లోయలోకి బస్సు పడిపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది. […]

ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 24 మంది మృతి
Ram Naramaneni
|

Updated on: Dec 24, 2019 | 11:09 AM

Share

ఇండోనేషియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రాథమికంగా అందుతోన్న సమాచారం ప్రకారం..మొత్తం 37 మంది ప్రయాణిస్తోన్న బస్సులో.. ఇప్పటికే 24 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 13 మంది తీవ్ర గాయాలవ్వగా, వారిని రెస్క్యూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దక్షిణ సుమత్రా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఏకంగా 150 అడుగుల లోయలోకి బస్సు పడిపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది. బస్సు తునాతునకలు అయిన ఆనవాళ్లు చూస్తుంటేనే ప్రమాద తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. కాగా ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.