Crime News: అమ్మవారి హుండీనే టార్గెట్ చేశారు.. సిసి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు..

| Edited By: Ravi Kiran

Jan 04, 2022 | 7:43 AM

ఏకంగా అమ్మవారి హుండీనే టార్గెట్ చేసి సిసి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు ముగ్గురు దొంగలు....

Crime News: అమ్మవారి హుండీనే టార్గెట్ చేశారు.. సిసి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు..
Thieves
Follow us on

ఏకంగా అమ్మవారి హుండీనే టార్గెట్ చేసి సిసి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు ముగ్గురు దొంగలు. నారాయణపేట జిల్లా శివారులోని లోకాయపల్లి లక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున ఓ మహిళా ఇద్దరు పురుషులు చోరీకి పాల్పడ్డారు. హుండీని తనతో తెచ్చుకున్న రాడ్డుతో పగులగొట్టి నగదు, కానుకలను ఎత్తుకెళ్లారు. ఆలయంలో సిసి కెమెరాలు ఉన్న సంగతి తొలుత గ్రహించని ఆ దొంగల ముఠా ఎంచక్కా తన పని పూర్తి చేసుకుంది.

అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల ఎవరూ రారనే ధీమాతో నింపాదిగా దొంగతనానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సిసి కెమెరాలను గమనించి వాటిని ధ్వంసం చేశారు. లోకాయపల్లి లక్ష్మమ్మ అమ్మవారి ఆలయం అటవీ ప్రాంతంలో నిర్మాణుష్య ప్రదేశంలో ఉండడం వల్ల దొంగలు తరచూ జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం కూడా ఈ దేవాలయంలో చోరీ జరిగింది. అయితే తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు కర్ణాటక బార్డర్ అవడం వల్ల అక్కడి దొంగల పని అయి ఉండవచ్చనే కోణంలోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also.. Online Gambling: కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం.. భార్యాపిల్లల్ని చంపి.. ఆపై