IND vs PAK Match: పాకిస్తాన్ విజ‌యంపై సంబరాలు.. ముగ్గురు కాశ్మీరి విద్యార్థుల అరెస్ట్.. 

Kashmiri Students Arrested: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియాపై పాకిస్తాన్ గెలుపొందిన విష‌యం తెలిసిందే. అయితే.. పాక్‌కు మద్దతు తెలుపుతూ దేశంలో పలుచోట్ల సంబరాలు జరిగాయి. ఈ సంఘటనలపై

IND vs PAK Match: పాకిస్తాన్ విజ‌యంపై సంబరాలు.. ముగ్గురు కాశ్మీరి విద్యార్థుల అరెస్ట్.. 
Arrest

Updated on: Oct 28, 2021 | 10:07 AM

Kashmiri Students Arrested: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియాపై పాకిస్తాన్ గెలుపొందిన విష‌యం తెలిసిందే. అయితే.. పాక్‌కు మద్దతు తెలుపుతూ దేశంలో పలుచోట్ల సంబరాలు జరిగాయి. ఈ సంఘటనలపై అందరి నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ గెలుపు అనంతరం సంబురాలు జరుపుకున్న ముగ్గురు విద్యార్థులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని రాజా బ‌ల్వంత్ సింగ్ కాలేజీలో చదువుతున్న కాశ్మీరీ విద్యార్థులు పాక్ గెలుపు తర్వాత సంబరాలు జరుపుకున్నారని.. కొందరు ఆగ్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు విద్యార్థుల‌ను అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆగ్రా సిటీ ఎస్పీ మాట్లాడుతూ.. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించ‌బోమ‌ని స్పష్టం చేశారు. విచార‌ణ అనంత‌రం ముగ్గురు క‌శ్మీరీ విద్యార్థుల‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా ముగ్గురు విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆగ్రాలోని రాజా బ‌ల్వంత్ సింగ్ కళాశాల యాజమాన్యం అంతకుముందు ప్రకటించింది.

సీఎం యోగి సీరియస్.. వార్నింగ్

ఇదిలాఉంటే.. ఈ ఘటన అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విట్ ద్వారా హెచ్చరించారు. పాకిస్తాన్ విజ‌యం అనంత‌రం ఆ దేశానికి మద్దతు తెలుపుతూ సంబురాలు జరుపుకున్న వారిపై దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేస్తామ‌ని యూపీ సీఎం యోగి స్పష్టం చేశారు. ఈమేరకు ట్విట్ చేశారు.

Also Read:

Crime News: అప్పుడు భార్యను దారుణంగా చంపాడు.. ఇప్పుడు అనుభవిస్తున్నాడు.. అసలేమైందంటే..?

Aryan Drugs Case: ఆర్యన్ డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న స్వతంత్ర సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్!