AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం ఫైర్‌.. దెబ్బకు రోడ్‌ క్లోజ్‌ చేసిన దీదీ సర్కార్‌..!

ప్రపంచ దేశాలన్నింటికి కరోనా మహమ్మారి ఎంతలా వణికిస్తోందో తెలిసిందే. మన దేశంలో కూడా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఈ వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలను కఠినంగా అమలు పరచడంతో.. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందంటూ కేంద్ర హోంశాఖ మండిపడింది. నిత్యం రద్దీగా ఉంటే “నార్కెల్‌ దంగా” మెయిన్ రోడ్డుపై యథేచ్చగా వాహనాలు వెళ్తుండటంతో పాటుగా.. కోల్‌కత్తాలోని రాజా బజార్, తాప్సియా, గార్డెన్ రీచ్‌తో […]

కేంద్రం ఫైర్‌.. దెబ్బకు రోడ్‌ క్లోజ్‌ చేసిన దీదీ సర్కార్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2020 | 5:02 PM

Share

ప్రపంచ దేశాలన్నింటికి కరోనా మహమ్మారి ఎంతలా వణికిస్తోందో తెలిసిందే. మన దేశంలో కూడా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఈ వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలను కఠినంగా అమలు పరచడంతో.. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందంటూ కేంద్ర హోంశాఖ మండిపడింది. నిత్యం రద్దీగా ఉంటే “నార్కెల్‌ దంగా” మెయిన్ రోడ్డుపై యథేచ్చగా వాహనాలు వెళ్తుండటంతో పాటుగా.. కోల్‌కత్తాలోని రాజా బజార్, తాప్సియా, గార్డెన్ రీచ్‌తో పాటు సెంట్రల్ కోల్‌కత్తాలో లాక్‌డౌన్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 10వ తేదీన దీదీ సర్కార్‌కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.

దీంతో శనివారం‘నార్కెల్ దంగా’ రోడ్డును ప్రభుత్వం మూసేసింది. మెయిన్ రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి.. వాహనాలను వెళ్లకుండా మూసేశారు. ఇక ప్రజలు లాక్‌డౌన్ ఉల్లంఘించకుండా..అన్ని ప్రాంతాల్లో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వెస్ట్ బెంగాల్ సీఎం కూడా తన అధికారిక ట్విట్టర్‌ వేదికగా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కరోనా నియంత్రణలో మమతా ప్రభుత్వం విఫలమవుతోందన్నారు.