AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 కోట్ల మందికి మాస్కుల పంపిణీ..: జేపీ నడ్డా

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిరుపేదలకు ఆహారాన్ని అందించడమే 'ఫీడ్‌ ద నీడీ' కార్యక్రమం లక్ష్యమని

10 కోట్ల మందికి మాస్కుల పంపిణీ..: జేపీ నడ్డా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2020 | 5:24 PM

Share

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిరుపేదలకు ఆహారాన్ని అందించడమే ‘ఫీడ్‌ ద నీడీ’ కార్యక్రమం లక్ష్యమని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రాల భాజపా అధ్యక్షులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి విడత లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. ఈ కార్యక్రమం ద్వారా 5 కోట్ల మందికి మాస్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా ఆహారం, రేషన్‌ బియ్యం అందజేశామన్నారు.

కాగా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘ఫీడ్‌ ద నీడీ’ కార్యక్రమం ద్వారా 10 కోట్ల మందికి మాస్కులు పంపిణీ చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రేషన్‌ సరుకులను తీసుకోని వారికి రెండో విడతలో పంపిణీ చేస్తామన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 90 వేల మంది భాజపా కార్యకర్తలు.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న ప్రజలకు సేవలందిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకూ రెండు కోట్ల నిత్యావసరాల కిట్లు, ఆరు కోట్లకు పైగా భోజనం ప్యాకెట్లను పేదలకు పంపిణీ జరిగిందని.. ప్రస్తుతం 40 లక్షల ఆహార పదార్థాలను పంపిణీ చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు.