Breaking: పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

|

Apr 25, 2020 | 9:50 AM

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. జిల్లాలోని అవంతిపొర గోరిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, ఆర్మీ బలగాల మధ్య జరిగిన కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు వారికి సహకరిస్తున్న వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం గాలింపు చర్యలు […]

Breaking: పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..
Follow us on

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. జిల్లాలోని అవంతిపొర గోరిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, ఆర్మీ బలగాల మధ్య జరిగిన కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు వారికి సహకరిస్తున్న వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..