AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేములవాడలో ఇద్దరికి కరోనా.. మర్కజ్‌ ప్రార్ధనలకు హాజరైన బాధితులు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు వ్యక్తలకు కరోనా పాజిటివ్ వచ్చింది. బాధితులిద్దరూ గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ తబ్లీఘీ జమాత్ సమావేశాలకు హజరైనట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ మార్చి 31వ తేదీ నుంచి వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఐసోషన్ వార్డులోనే ఉంటున్నారు. అయితే తాజాగా కరోనా పరీక్షలు జరపగా.. పాజిటివ్‌గా వచ్చింది. దీంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఇప్పటికే 10వ తేదీన కూడా ఓ యువకుడికి ఎలాంటి […]

వేములవాడలో ఇద్దరికి కరోనా.. మర్కజ్‌ ప్రార్ధనలకు హాజరైన బాధితులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2020 | 9:13 PM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు వ్యక్తలకు కరోనా పాజిటివ్ వచ్చింది. బాధితులిద్దరూ గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ తబ్లీఘీ జమాత్ సమావేశాలకు హజరైనట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ మార్చి 31వ తేదీ నుంచి వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఐసోషన్ వార్డులోనే ఉంటున్నారు. అయితే తాజాగా కరోనా పరీక్షలు జరపగా.. పాజిటివ్‌గా వచ్చింది. దీంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఇప్పటికే 10వ తేదీన కూడా ఓ యువకుడికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ రావడంతో కలకలం రేగింది.

మరోవైపు రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏడువందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 18మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండటంతో.. ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటోంది.