మోదీ పంపించిన టాబ్లెట్లు వేసుకుంటున్నా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

| Edited By:

May 19, 2020 | 12:26 PM

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదహారు లక్షలకు చేరింది. ఇక మరణాల సంఖ్య దాదాపు లక్షకు చేరింది. దీంతో అమెరికా ప్రజలు కరోనా టెన్షన్‌తో వణికిపోతున్నారు. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా రెగ్యులర్‌గా వైరస్ టెస్టులు చేయించుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాజాగా ఆయన […]

మోదీ పంపించిన టాబ్లెట్లు వేసుకుంటున్నా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Follow us on

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదహారు లక్షలకు చేరింది. ఇక మరణాల సంఖ్య దాదాపు లక్షకు చేరింది. దీంతో అమెరికా ప్రజలు కరోనా టెన్షన్‌తో వణికిపోతున్నారు. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా రెగ్యులర్‌గా వైరస్ టెస్టులు చేయించుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ప్రకటన.. అమెరికా వాసుల్ని షాక్‌కు గురిచేస్తోంది.

కరోనా మహమ్మారి బారినపడకుండా.. ముందస్తు జాగ్రత్తగా.. హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లు వేసుకుంటున్నానని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ టాబ్లెట్ల వినియోగం గురించి అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని వాడితే.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని.. హార్ట్‌కు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉందంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. తాను రోజుకు ఒక టాబ్లెట్‌ను గత వారం రోజులుగా వేసుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి.. వ్యాపారాలు తిరిగి ప్రారంభించడంపై రెస్టారెంట్ల ఎగ్జిక్యూటివ్‌లతో కలిసినప్పుడు జరిగిన ప్రెస్‌మీట్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తొలుత.. కరోనా కట్టడికి హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లు ఉపయోగపడతాయని.. ట్రంప్ ప్రచారం చేశారు. అంతేకాదు.. పెద్ద మొత్తంలో మన భారత్‌ నుంచి టాబ్లెట్లను కూడా తెప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అమెరికాలో జరిపిన పలు అధ్యయనాల్లో.. ఈ మాత్రలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలేదని తేల్చాయి. అంతేకాదు.. కరోనా బారినపడ్డ రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు ఇస్తే.. వారిలో హృద్రోగ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అయితే తాజాగా ట్రంప్ మాత్రం ఇవే టాబ్లెట్లను వాడుతున్నానని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.