AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో భారీగా పెరుగుతున్న రికవరీలు

ఇటు తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండగా..అదే సమయంలో రికవరీల సంఖ్య కూడా భారీగా పెరిగింది.

తెలంగాణలో భారీగా పెరుగుతున్న రికవరీలు
Jyothi Gadda
|

Updated on: May 19, 2020 | 1:39 PM

Share

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను కరోనా రక్కసి వణికిస్తోంది. గత రెండు నెలలుగా దేశంలో వైరస్ పంజా విసురుతోంది. కోవిడ్ కోరల్లో చిక్కుకుని పలు రాష్ట్రాలు హడలెత్తిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు కరోనా ధాటికి విలవిలలాడుతున్నాయి. రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ కావటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల వరకు ఎవ్వరినీ విడిచి పెట్టటం లేదు కరోనా. ఇప్పటికే దేశంలో మొత్తం కేసుల సంఖ్య లక్షదాటేసింది.

అయితే, మరో ఆసక్తికర విషయం ఎంటంటే..పాజిటివ్ కేసులకు సమాంతరంగా రికవరీలు కూడా భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. మన దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య లక్ష దాటింది. మొత్తం 1,01,139 మంది కరోనా బారినపడగా అందులో 39,173 మంది కరోనాపై విజయం సాధించి డిశ్చార్జ్ అయ్యారు. అంటే రికవరీ రేటు సుమారు 40 శాతంగా ఉంది. అలాగే మరణాల రేటు సైతం తక్కువగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,163 మంది కరోనాతో చనిపోయారు. అంటే మరణాల రేటు 3 శాతం మాత్రమే. మరణాల రేటు తక్కువగా, రీకవరీ రేటు ఎక్కువగా ఉండటం శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు.

ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండగా..అదే సమయంలో రికవరీల సంఖ్య కూడా భారీగా పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారిలో 62.03శాతం మంది అంటే 1,002 మంది కరోనా మహమ్మారి నుండి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. ఇలా కరోనా నుండి కోలుకున్న వారిలో ఎక్కువ శాతం మంది 21 ఏళ్ల నుండి 40 ఏళ్ల లోపు వారు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

Follow Us
పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త
పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త
వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త
వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త
ఇంగ్లండ్‌తో నేడు బిగ్ ఫైట్..పాకిస్థాన్ సెమీస్ ఆశలు గట్టెక్కేనా?
ఇంగ్లండ్‌తో నేడు బిగ్ ఫైట్..పాకిస్థాన్ సెమీస్ ఆశలు గట్టెక్కేనా?
రైలు నడిపే లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..
రైలు నడిపే లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..
అయ్యప్పమాలలో వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. అల్లు శిరీష్ క్లారిటీ
అయ్యప్పమాలలో వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. అల్లు శిరీష్ క్లారిటీ
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఏమన్నారంటే..
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఏమన్నారంటే..
రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..
రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..
ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..
ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..
ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై బీసీసీఐ సంచలన నిర్ణయం
ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై బీసీసీఐ సంచలన నిర్ణయం
కేంద్రం కొత్త నిర్ణయం.. దేశవ్యాప్తంగా బాలికలకు ఇది ఫ్రీ..
కేంద్రం కొత్త నిర్ణయం.. దేశవ్యాప్తంగా బాలికలకు ఇది ఫ్రీ..