ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ..చర్చించే కీలక అంశాలివే..
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 5న జరగనుంది. ముఖ్యంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 5న జరగనుంది. ముఖ్యంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, కరోనా పరిస్థితుల్లో విద్యారంగంలో తీసుకోవలసిన చర్యలను మంత్రివర్గంలో చర్చించనున్నారు.
అంతేకాదు..కొత్తగా నిర్మించ తలపెట్టిన సచివాలయ నిర్మాణం, నియంత్రిత సాగు వంటి అంశాలపై కూడా కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం.
Read More:
తెలంగాణలో కొత్తగా 2వేలు దాటిన కరోనా కేసులు..
టీచర్కు విద్యార్థుల ‘గురుదక్షిణ’.. భావోద్వేగంలో ఉపాధ్యాయుడు