దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కేసులతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికే నిత్యం పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతూనే ఉంటున్నారు. ఇక కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలోకి చేరింది భారత్. అటు, తమిళనాడులో కూడా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ ఐదు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 5,958 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 118 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,97,261కి, మరణాల సంఖ్య 6,839కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 5606 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,38,060 మంది కోలుకోగా, ప్రస్తుతం 52,362 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
Tamil Nadu reports 5,958 new #COVID19 cases, 5,606 recoveries and 118 deaths, taking active cases to 52,362, recoveries to 3,38,060 and deaths to 6,839: State Health Department pic.twitter.com/oXc59AeEmX
— ANI (@ANI) August 26, 2020
Read More:
సూర్యని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారుః భారతీరాజా
డీప్ కోమాలోనే ప్రణబ్ ముఖర్జీః ఆర్మీ ఆస్పత్రి వైద్యులు
బ్రేకింగ్ః తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్