ఏపీలో ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతిచ్చింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పరిస్థితి గందరగోళంగా మారింది. చాలాచోట్ల మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు పెద్ద ఎత్తున బారులు తీరారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దులు దాటి మీర కొందరు మద్యం ప్రియులు ఏపీకి క్యూ కట్టారు. దీంతో ఇటు ఏపీ- తెలంగా, అటు ఏపీ – తమిళనాడు బార్డర్లో అనూహ్యమైన రద్దీ ఏర్పడింది. వారిని అదుపు చేయడానికి పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థానిక బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సర్కార్ చర్యలపై కేంద్రానికి కంప్లైట్ చేస్తామంటున్నారు.