AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో దావూద్ మృతి..!

తాజాగా దావూద్‌తోపాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్-19 సోకిందని... వారికి కరాచీలోని మిలటరీ ఆస్పత్రిలో చికత్స అందిస్తున్నట్లుగా పాకిస్తాన్ వార్త సంస్థలు ప్రచారం చేశాయి. చికిత్స అందిస్తున్న క్రమంలో దావూద్ చనిపోయినట్లుగా పాకిస్తాన్‌లోని ప్రముఖ టీవీ ఛానల్ న్యూస్‌ ఎక్స్‌ ప్రసారం చేసింది.

కరోనాతో దావూద్ మృతి..!
Sanjay Kasula
|

Updated on: Jun 06, 2020 | 4:06 PM

Share

మోస్ట్‌ వాటెండ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అవును ఇది నిజమే అంటూ… కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా పెద్ద ఎత్తున చర్చను మొదలు పెట్టాయి.  1994 నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలో భార్య మెహజబీన్‌తో కలిసి తలదాచుకుంటున్నాడు. దావుద్ పూర్తి భద్రతను ఐఎస్ఐ కల్పిస్తోంది. అయితే పాకిస్తాన్‌లో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందటంతో వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. తాజాగా దావూద్‌తోపాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్-19 సోకిందని… వారికి కరాచీలోని మిలటరీ ఆస్పత్రిలో చికత్స అందిస్తున్నట్లుగా పాకిస్తాన్ వార్త సంస్థలు ప్రచారం చేశాయి. చికిత్స అందిస్తున్న క్రమంలో దావూద్ చనిపోయినట్లుగా పాకిస్తాన్‌లోని ప్రముఖ టీవీ ఛానల్ న్యూస్‌ ఎక్స్‌ ప్రసారం చేసింది. ఈ న్యూస్ కాస్తా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. దీంతో ప్రపంచ దేశాలు చేయని పనిని కరోనా చేసిందని నెటిజన్లు సెటైర్లు సంధిస్తున్నారు. ఇప్పడికైనా పాపం పండిందని నిప్పులు చెరుగుతున్నారు.

అయితే దావూద్ మృతిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోయినా… మీడియాలో వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ ఇబ్రహీం ప్రధాని నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా పాకిస్తాన్‌లో దక్కుంటున్నాడు.