AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: విద్యార్థులకు 2 నెలల ఫీజు మాఫీ!

కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలు, దినసరి కూలీలను ఆదుకునేందుకు అనేక మంది అనేక రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాగా, ఓ పాఠశాల యాజమాన్యం కరోనాపై పోరులో తమవంతు ఆర్థిక సాయాన్ని అందించి పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

కరోనా ఎఫెక్ట్: విద్యార్థులకు 2 నెలల ఫీజు మాఫీ!
Jyothi Gadda
|

Updated on: Jun 25, 2020 | 11:30 AM

Share

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించటంతో ఆర్థిక వ్యవస్థలు భారీగా దెబ్బతిన్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలు, దినసరి కూలీలను ఆదుకునేందుకు అనేక మంది అనేక రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాగా, ఓ పాఠశాల యాజమాన్యం కరోనాపై పోరులో తమవంతు ఆర్థిక సాయాన్ని అందించి పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గల ఒక పాఠశాల తనవంతు భాగస్వామ్యాన్ని అందిస్తోంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల రెండు నెలల ఫీజును యాజమాన్యం మాఫీ చేసింది. ప్రయాగ్‌రాజ్‌లోని ఏజేసీ పబ్లిక్ స్కూలులో 800 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, రూ. 8 లక్షల ఫీజులను యాజమాన్యం మాఫీ చేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్కూల్ మేనేజర్ శైలేంద్ర కుమార్ పాండే మాట్లాడుతూ ..కోవిడ్ సంక్లిష్ట పరిస్థితుల్లో చాలామంది డబ్బును ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు పంపుతుండగా, మేము మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.