కర్ణాటకలో కొత్తగా మరో 7,040 పాజిటివ్‌ కేసులు

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 7,040 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో..

కర్ణాటకలో కొత్తగా మరో 7,040 పాజిటివ్‌ కేసులు

Updated on: Aug 16, 2020 | 10:00 PM

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 7,040 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 2,131 కరోనా పాజిటివ్ కేసులు బెంగళూరు అర్బన్‌లోనే నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్
కేసుల సంఖ్య 2,26,966కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,41,491 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 81,512 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో అన్‌లాక్ 1.0 ప్రారంభమైన తర్వాత కేసుల సంఖ్య అమాంతం
పెరిగిపోయింది. నిత్యం 5 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Read More :

ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Loading...
Unable to load recommendations.
Follow Us