AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా డీలక్స్ గదులు..మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలకు మాత్రమే!

కరోనా సోకిన సాధారణ ప్రజలకు ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు కూడా లభించక అవస్థలు పడుతున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రభుత్వ అధికారుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి అధికారులు.

కరోనా డీలక్స్ గదులు..మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలకు మాత్రమే!
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jun 25, 2020 | 7:13 PM

Share

దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కోవిడ్ కేసులు బయటపడుతుండగా..ఆస్పత్రుల్లో బెడ్లు, ఐసోలేషన్ సదుపాయాలు అందక అవస్థలు పడాల్సిన దుస్థితి చాలా ప్రాంతాల్లో ఎదురవుతోంది. ఇకపోతే, కరోనా సోకిన సాధారణ ప్రజలకు ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు కూడా లభించక అవస్థలు పడుతున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రభుత్వ అధికారుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి అధికారులు.

కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండగా, అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బెంగళూరులో ఇటీవల పునరుద్ధరించిన కుమార కృప అతిథి గృహంలోని వంద డీలక్స్ గదులను కరోనా సోకిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం కేటాయిస్తున్నట్లు యెడ్యూరప్ప ప్రభుత్వం బుధవారం(జూన్24న) ఉత్తర్వులు జారి చేసింది. ఈ వీవీఐపీ అతిథి గృహంలోని లగ్జరీ గదుల భర్తీ 33 శాతం మించకుండా చూడాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓ వైపు కరోనా బారినపడుతున్న సాధారణ ప్రజలు ఆస్పత్రుల్లో చోటు, వసతులు లేక అల్లాడుతుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలకు డీలక్స్‌ గదులను కేటాయించడాన్ని తప్పుబడుతూ విమర్శలు చేస్తున్నారు. అయితే.. అధికార పార్టీ నేతలు మాత్రం ప్రభుత్వ చర్యను సమర్థించుకుంటున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటున్నట్లు వివరణ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య పది వేల మార్కును దాటింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడి 164 మంది మృత్యువాతపడ్డారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!