AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు టెర్రరిస్టుల హతం

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదలు హతమయ్యారు. కుల్గాం జిల్లా నిపొరకు సమీపంలో ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో శనివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంద తనిఖీలు నిర్వహించారు...

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... ఇద్దరు టెర్రరిస్టుల హతం
Sanjay Kasula
|

Updated on: Jun 13, 2020 | 8:37 AM

Share

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదలు హతమయ్యారు. కుల్గాం జిల్లా నిపొరకు సమీపంలో ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో శనివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వీరి కదలికల్ని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో గుర్తు తెలియని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో జమ్ముకశ్మీర్ పోలీసులు, సైన్యానికి చెందిన 19 మంది ఆర్ఆర్ దళాలు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండగా.. మరో వైపు ఉగ్రవాదుల కదలికలు పెరగడం ఆందోళనకు గురి చేస్తున్నాయి. టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

ఇదిలావుంటే పాకిస్తాన్ మరోమారు తమ వక్రబుద్ధిని చూపించింది. బాల్కోట్, మంజాకోట్, సెక్టార్లలో శుక్రవారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది. సరిహద్దుల వెంట భారీ స్థాయిలో మోర్టార్లతో దాడి చేసింది. వీటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టాయి.