AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఎస్ ! ఇండియా ఆర్థికంగా కోలుకుంటోంది’.. ప్రధాని మోదీ

కరోనా వైరస్ లాక్ డౌన్ అనంతరం ఇండియా ఆర్థికంగా కోలుకుంటోందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇప్పటికే 'అన్ లాక్' కారణంగా ఈ కొత్త దశలో ఉన్నామని, మనం మళ్ళీ వృద్ధిని సాధిస్తామని..

'ఎస్ ! ఇండియా ఆర్థికంగా కోలుకుంటోంది'.. ప్రధాని మోదీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 02, 2020 | 12:34 PM

Share

కరోనా వైరస్ లాక్ డౌన్ అనంతరం ఇండియా ఆర్థికంగా కోలుకుంటోందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇప్పటికే ‘అన్ లాక్’ కారణంగా ఈ కొత్త దశలో ఉన్నామని, మనం మళ్ళీ వృద్ధిని సాధిస్తామని ఆయన చెప్పారు. మంగళవారం ఆర్థికవేత్తలు, పారిశ్రామిక వేత్తల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. తాను ఎంతో విశ్వాసంగా ఉన్నానని, ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్ఛునని, కానీ ఈ దేశ ప్రతిభ (టాలెంట్), ఇన్నోవేషన్, హార్డ్ వర్క్, వర్క్ ఫోర్స్ వంటివి తన నమ్మకానికి ఆలంబనగా నిలిచాయని అన్నారు.

కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) 125  వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్ లైన్ ద్వారా మాట్లాడిన మోదీ…ఓ వైపు మనం సురక్షితంగా ఉంటూనే కరోనా వైరస్ మీద పోరాడాలని, అదే సమయంలో మన ఎకానమీని కొనసాగించాలని పేర్కొన్నారు. లాక్ డౌన్ నుంచి ప్రస్తుతం ‘అన్ లాక్’-ఫేజ్ 1 ‘కి వచ్చాం.. అంటే ఇప్పటికే మళ్ళీ గ్రోత్ ఆరంభమైనట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. భారత దేశం స్వావలంబన సాధించాలంటే ‘ఇంటెంట్. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్ మెంట్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇన్ క్లూజన్’ అవసరమని పేర్కొన్నారు. అంటే చిత్తశుద్ది, కృషి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, సరికొత్త ఆలోచనలు, పథకాలు అవసరమవుతాయన్నారు. మీ పారిశ్రామిక రంగానికి అండగా ఉంటానని హామీ ఇఛ్చిన ఆయన.. తనపై విశ్వాసం ఉంచాలని, మనం మళ్ళీ వృద్ధిని సాధించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పారు. ఇండస్ట్రీ లీడర్లు దేశీయ స్ఫూర్తికి ఛాంపియన్లు కావాలన్నారు. మేడిన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ అన్నట్టు వస్తువులను మనమే ఉత్పత్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.