చేపమందును వదలని కరోనా
కరోనా ప్రభావం చేప మందుపై కూడా పడింది. అస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్ లో బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తూ వస్తున్నారు. కరోనా కారణంగా ఈ యేడాది చేప మందు వేయడం లేదని బత్తిన హరినాథ్ గౌడ్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు హరినాథ్ గౌడ్ వెస్ట్ మారేడ్పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి పంపిణీ చేయడం లేదని వినతిపత్రం […]
కరోనా ప్రభావం చేప మందుపై కూడా పడింది. అస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్ లో బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తూ వస్తున్నారు. కరోనా కారణంగా ఈ యేడాది చేప మందు వేయడం లేదని బత్తిన హరినాథ్ గౌడ్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు హరినాథ్ గౌడ్ వెస్ట్ మారేడ్పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి పంపిణీ చేయడం లేదని వినతిపత్రం అందజేశారు. ఏటా దేశ విదేశాల నుంచి వేలాది మంది చేప మందుకోసం హైదరాబాద్ వస్తుంటారని, ఈ సంవత్సరం మాత్రం ఎవ్వరూ రావొద్దని హరినాథ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని, ఇందుకు హరినాథ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. స్వయం నియంత్రణ, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించడం కరోనా నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బత్తిని సోదరులు వెల్లడించారు.